Kota Srinivasa Rao About NTR: ఈరోజుల్లో టాలీవుడ్ టాప్ యాక్టర్లు ఎవరు అంటే చాలామంది ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనే చెప్తారు. చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం వీరి యాక్టింగ్ గురించి, డెడికేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ యాక్టివ్‌గా సీనియర్ హీరోల గురించి పక్కన పెడితే ప్రస్తుతం ఈ నలుగురు హీరోలే టాలీవుడ్ టాప్ స్థానాల్లో ఉన్నారు. మార్కెట్ విషయంలో కూడా ఈ నలుగురు హీరోలపై గట్టి పోటీ నడుస్తోంది. అందుకే ఫ్యాన్ వార్స్ కూడా గట్టిగా జరుగుతుంటాయి. తాజాగా సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాస రావు సైతం మహేశ్ బాబు, ఎన్‌టీఆర్, అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఎన్‌టీఆర్ తర్వాతే..


ఎన్‌టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబులలో తనకు ఎన్‌టీఆర్ అంటేనే ప్రత్యేకమైన ఇష్టం ఉందని కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిలో ఎవరు టాప్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా దృష్టిలో జూనియర్ ఎన్‌టీఆర్‌కు ఎవరూ సాటిరారు. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా.. ఎన్‌టీఆర్‌లో ఒక మ్యాజిక్ ఉంది. అదే స్క్రీన్‌పైన కనిపిస్తుంది’’ అని తెలిపారు కోట శ్రీనివాస రావు. ఎన్‌టీఆర్‌తో పాటు అల్లు అర్జున్, మహేశ్ బాబును కూడా ప్రశంసించారు. ఎన్‌టీఆర్ తర్వాత టాప్ స్థానానికి చేరుకునే సత్తా వీరికే ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం కోట శ్రీనివాస రావు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


‘దేవర’ విషయంలో సంతోషం..


ప్రస్తుతం ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్.. ముగ్గురూ మూడు ప్యాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ చిత్రం ఇప్పటికే షూటింగ్ చాలా లేట్ అయ్యింది. సమ్మర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏకంగా అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ అనూహ్యంగా సెప్టెంబర్‌లోనే ఈ మూవీ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంలో ‘ఫియర్ సాంగ్’ విడుదలయ్యి మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘దేవర’లో ఎన్‌టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య అదిరిపోయే డ్యూయెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.


‘పుష్ప 2’పై క్లారిటీ లేదు..


ఎన్‌టీఆర్ తర్వాత వరుసగా సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఇప్పటికే ‘పుష్ప’ విడుదలయ్యి మూడేళ్లు అవుతున్నా ‘పుష్ప పార్ట్ 2’ విడుదల మాత్రం ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. గతేడాదిలోని ‘పుష్ప 2’ విడుదల కావాల్సి ఉంది కానీ అప్పటినుండి పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతూ ఆగస్ట్ 15 వరకు వచ్చింది. ఫైనల్‌గా ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ విడుదల అంటూ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమయ్యింది. కానీ ఇంతలోనే ఏకంగా డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది ఈ మూవీ. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక మహేశ్ బాబు కూడా రాజమౌళితో సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడో క్లారిటీ లేదు.



Also Read: పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే చేయొచ్చు, నా స్థాయి ముఖ్యం కాదు - కిరణ్ అబ్బవరం