రామాయ‌ణం తెలియని ప్రజలు, మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్రుని గురించి తెలియని భక్తులు ఉండరు. తరతరాలకు తరగని తేజస్సు శ్రీరాముని సొంతం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతూ రామాయ‌ణం ఆధారంగా మన భారతదేశంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాట‌లో నడుస్తూ మరో ఆ శ్రీరామ చంద్రుని రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధం అయ్యారు.


అయోధ్యకు ప్రయాణం... రామచరితం!
చిత్రాల‌యం స్టూడియోస్ (Chitralayam Studios) నిర్మాణ సంస్థను స్థాపించిన వేణు దోనేపూడి... ఆ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 1గా 'విశ్వం' (Gopichand's Viswam Movie) ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు ప్రొడక్షన్ నంబర్ 2 'జర్నీ టు అయోధ్య' అనౌన్స్ చేశారు. 


వీఎన్‌ ఆదిత్య‌ అందించిన కథతో...
తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యంలో!
Journey To Ayodhya Movie Crew List: చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 2కు 'జర్నీ టు అయోధ్య' వర్కింగ్ టైటిల్ అని వేణు దోనేపూడి చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు వీఎన్‌ ఆదిత్య‌ (VN Aditya) అందించిన కథతో... ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!






'జర్నీ టు అయోధ్య' సినిమా గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ... ''శ్రీరామ చంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన గుణగణాలు ఈతరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగదభిరాముడు, సకల గుణధాముడు, ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్య గురించి సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే  శ్రీరామ నవమి నాడు సినిమా ప్రకటించడం సంతోషంగా ఉంది. వీఎన్ ఆదిత్య గారి నేతృత్వంలోని ఓ బృందం అయోధ్య స‌హా ప‌లు ప్రదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓ యువ దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఆయనతో పాటు ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్లడిస్తాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీగా ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తాం'' అని చెప్పారు.


Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!



గోపీచంద్ 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్‌కు సూపర్ రెస్పాన్స్!
ప్ర‌స్తుతం గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి చిత్రాల‌యం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి 'విశ్వం' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫస్ట్ స్ట్రైక్ పేరుతో ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది.


Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే