Jai Simha Heroine Natasha Doshi Marriage: గత రెండేళ్లలో సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య ఎక్కువయిపోతోంది. అందరూ ఘనంగా తమ తమ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత వారే స్వయంగా ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగామరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కింది. కానీ గత నెలలో అంటే జనవరిలో తన పెళ్లి జరిగితే.. నెలరోజుల తర్వాత ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది ఈ భామ. తను మరెవరో కాదు ‘జై సింహా’ ఫేమ్ నటాషా దోశి. బిజినెస్ మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ.. షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


గతేడాది ఎంగేజ్‌మెంట్..


బాలకృష్ణలాంటి హీరో సరసన ‘జై సింహా’ సినిమాతో డెబ్యూ చేసినా కూడా నటాషా దోశీకి లక్ కలిసి రాలేదు. మాలీవుడ్ లాగానే టాలీవుడ్‌లో కూడా తనకు అవకాశాలు కరువయ్యాయి. చివరిగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో ఐటెమ్ గర్ల్‌గా కనిపించింది. ఆ తర్వాత వెండితెరపై కనుమరుగమయిపోయింది ఈ భామ. తాజాగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. మనన్ షా అనే బిజినెస్ మ్యాన్‌ను నటాషా ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది జులైలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక 2024 జనవరి 31న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తన సోషల్ మీడియా పోస్టుల్లో బయటపెట్టింది. 






మిస్ టాలెంటెడ్..


ముంబాయ్‌లో పుట్టి పెరిగిన నటాషా దోశీ.. యాక్టింగ్ కెరీర్‌ను మాత్రం కేరళ నుండే మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకు యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం ఉండడంతో క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. అంతే కాకుండా 2010లో తనకు మిస్ కేరళ పోటీల్లో మిస్ టాలెంటెడ్ అని కిరీటాన్ని కూడా దక్కించుకుంది. అలా మెల్లగా సినిమాల్లో తన ప్రయాణం మొదలయ్యింది. హీరోయిన్‌గా కూడా తను ముందుగా మలయాళ చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించింది. 2010లో తనకు మిస్ టాలెంటెడ్‌గా కిరీటం దక్కిన తర్వాత మలయాళ సినిమా ఆఫర్లను తనను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకే 2012లో ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.


బాలయ్య సరసన..


ముందుగా 2012లో ‘మాంత్రికన్’ అనే మలయాళ సినిమాలో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది నటాషా దోశీ. అదే ఏడాది ‘హైడ్ ఎన్ సీక్’తో మరోసారి ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలు తను ఆశించనంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. అదే సమయంలో సీనియర్ హీరో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమే ‘జై సింహా’. ఇందులో నయనతార, హరిప్రియలతో పాటు నటాషా కూడా మూడో హీరోయిన్‌గా నటించింది. దీంతో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కోతల రాయుడు’ అనే చిత్రంలో కూడా తనకు అవాకశం వచ్చింది. కానీ సినిమాలు తనకు వర్కవుట్ అవ్వలేదు. పర్సనల్ లైఫ్‌లో అయినా తను హ్యాపీగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Also Read: అంబానీ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం - షారుక్‌పై మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌