నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'రూలర్'లో నటించిన కథానాయిక వేదిక గుర్తు ఉన్నారా? ఆ సినిమా కంటే ముందు నారా రోహిత్ 'బాణం', రాఘవ లారెన్స్ 'ముని', 'కాంచన 3' చిత్రాల్లో నటించారు. ఆమె కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.


''అందరూ మాస్క్ ధరిస్తున్నారు కదా!? ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉన్న పెద్దల కోసం... వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారి కోసం మాస్క్ ధరించండి'' అంటూ వేదిక ఒక పోస్ట్ చేశారు. అందులో తాను కరోనా బారిన పడినట్లు చెప్పుకొచ్చారు. ''ఒకవేళ కొవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే తక్కువ అంచనా వేయకండి'' అని జాగ్రత్తలు చెప్పారు.


''అందరికీ హాయ్! దురదృష్టవశాత్తూ... నేను కరోనా బారిన పడ్డాను. నాకు మహమ్మారి సోకడం ఇదే తొలిసారి. అందరిలో స్వల్ప లక్షణాలు ఉండవు. కొన్ని రోజుల నుంచి నాకు తీవ్ర జ్వరం వస్తూ, పోతూ ఉంది. కరోనా లక్షణాలను తక్కువ అంచనా వేయకండి. ఒళ్లునొప్పులు, జ్వరంతో రావడం మంచిది కాదు. ఒకసారి కరోనా వచ్చి తగ్గింది కాబట్టి మళ్ళీ మీకు రాదని అనుకోకండి. నాకు తెలిసిన వారిలో నెలలో రెండుసార్లు వచ్చింది. అందుకని... మీరు ఒకరిని కలిసినా, వంద మందిని కలిసినా మాస్క్ ధరించండి. సేఫ్‌గా ఉండటం మంచిది. ఇప్పుడు నాకు బావుంది. త్వరలో కోలుకుంటాను. మీరు సేఫ్‌గా ఉండండి'' అని వేదిక పేర్కొన్నారు. 


Also Read: శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read: చూసేయండి సార్ - కొత్త సినిమాలో 'జాతి రత్నాలు' భామ లుక్ చూసేయండి