'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఫరియా అబ్దుల్లాకు అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ఇది ఫరియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో ఆమె కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


తమిళ హీరో, 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనికి జంటగా ఫరియా అబ్దుల్లా నటిస్తున్న సినిమా 'వల్లి మయిల్'. దీనికి సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. 80వ దశకం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.


ఫరియా అబ్దుల్లా లుక్ చూస్తే... 80ల వాతావరణం కనిపిస్తోంది కదూ! ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ''యాక్టింగ్ పవర్ హౌస్ ఫరియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొంది.


Also Read: శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?


విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.     


Also Read : స్విస్, ఫ్రాన్స్ to గ్రీస్ - ప్రగ్యా జైస్వాల్ టూర్ ఫొటోస్, వీడియోస్ చూశారా?