Actress Sathya Sri on Extra Ordinary Man Movie Naa Pette Talam Tesi Song: నితిన్ హీరో వక్కంతం వంశీ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఈ మూవీలోని ఓ పాట తీవ్ర చర్చకు కారణం అయ్యింది. ఓ బూతు పాటను సినిమాలో పెట్టడం ఏంటనే విమర్శలు వచ్చాయి. అదీ అమ్మాయిలతో ఆ పాటకు స్టెప్పులు వేయించడం ఏంటని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనుకున్నది వేరు, జరిగింది వేరు- సత్యశ్రీ


తాజాగా ఈ పాట వివాదం గురించి నటి సత్యశ్రీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ పాటలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించింది. “ఈ పాట మూడు రోజుల్లో షూట్ చేస్తారనగా నాకు సినిమా యూనిట్ నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారని అనుకున్నాం. ఈ క్యారెక్టర్ కు డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. స్విచ్చువేషన్ కు తగినట్లుగా ఈ పాట వస్తుంది అని చెప్పారు. నేను కూడా సరే అన్నాను. రేపు షూట్ అనగా, ఈ రోజు సాంగ్ ఏంటండీ అని అడిగాను. వాళ్లు ఇదీ సాంగ్ అని చెప్పారు. నా ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. రేపు పాట షూట్. చేస్తానని ఒప్పుకున్న. కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా, షూట్ కి వెళ్లాను. మొదట్లో నితిన్ తో ఓ సీన్ లో నటించాను. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చారు. మంచి క్యారెక్టర్ వచ్చింది చెయ్ అన్నారు. పాట ప్లే చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది. నాకు ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. శేఖర్ మాస్టర్ వచ్చి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని చెప్పారు. అయినా, నేను చేయలేకపోతున్నాను. 15 టేకులు తీసుకున్నాను. ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. అప్పుడు దర్శకుడు వంశీ వచ్చి, సత్య నిన్ను ఎక్స్ పోజింగ్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ సెక్సీ లుక్స్ ఇవ్వు చాలు అన్నారు. నన్ను నమ్ము, వల్గారిటీ ఉండదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాను. మూడు రోజులు షూట్ చేశాం. నేను భయపడినంతగా ఏమీ లేదు. చాలాసార్లు దర్శకుడిని అడిగాను, ఈ పాట వేరేలా జనల్లోకి వెళ్లదు కదా అని. ఆయన లేదని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హీరో నితిన్ కూడా చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు” అని చెప్పుకొచ్చింది.  


'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సాంగ్ పై తీవ్ర విమర్శలు


'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఇంటర్వెల్ తర్వాత  చమ్మక్ చంద్రతో పోలీస్ స్టేషన్‌ సన్నివేశం ఉంటుంది. దానికి ముందు రోడ్డు మీద లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరితో అసభ్యంగా మాట్లాడటంతో హీరో బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. తాళం ఉన్నప్పటికీ...  లేదని చెప్పి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు 'నా పెట్టి తాళం తీసి' సాంగ్ వస్తుంది. ఆ పాటకు 'జబర్దస్త్' ద్వారా పాపులరైన సత్య శ్రీ, 'విరూపాక్ష' ఫేమ్ సోనియా సింగ్ డ్యాన్స్ చేశారు. ఈ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 


Read Also: ఇష్టం లేకపోతే చూడకండి, ‘యానిమల్’ విమర్శలపై త్రిప్తి దిమ్రి ఘాటు వ్యాఖ్యలు!