ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరిచే విధంగా సిద్ధార్థ్ సెక్సిస్ట్ కామెంట్స్ చేయడంతో విషయం సీరియస్ అయింది. సిద్ధార్థ్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. వెంటనే సైనాను క్షమాపణలు కోరాడు సిద్ధార్థ్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లెటర్ ను షేర్ చేశారు. 


"డియర్ సైనా... కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను చేసిన ట్వీట్‌లో అసభ్యకరమైన జోక్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీతో చాలా విషయాల్లో నేను ఏకీభవించకపోవచ్చు. అయితే... మీ ట్వీట్ చదివిన తర్వాత నాలో వచ్చిన కోపం కానీ, నా నిరాశ కానీ నేను ఉపయోగించిన భాషను, నా స్వరాన్ని సమర్థించలేవు. నేను చేసిన జోక్ విషయానికి వస్తే... దాన్ని వివరించాల్సి ఉంది. అది మంచి జోక్ కాదు. ఆ జోక్ విషయంలో సారీ. నువ్ ఎప్పుడూ నా ఛాంపియన్ వే" అంటూ రాసుకొచ్చారు. 


సిద్ధార్థ్ చెప్పిన సారీ సైనా నెహ్వాల్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను బంజారాహిల్స్‌కు చెందిన ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్‌ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 67 సైబర్‌ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 


Also Read: ఓటీటీలో ప్రియమణి సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..


Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?


Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..


Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..


Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..


Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?


Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి