నటిగా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకి షిఫ్ట్ అయింది రష్మి. యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. 'జబర్దస్త్' షో ఆమెకి భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ షోలో తన హాట్ అందాలతో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఆమెకి హీరోయిన్ గా చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 'గుంటూరు టాకీస్' అనే సినిమాతో హిట్టు కూడా అందుకుంది. కానీ ఆ తరువాత ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా రాలేదు. కానీ కొన్ని సినిమాల్లో నటించింది. 

 


 

ఈ మధ్యకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బుల్లితెరకే పరిమితమైంది. ఇలాంటి సమయంలో ఆమెకి మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో 'భోళా శంకర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

 

ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ను మొదలుపెట్టారు. త్వరలోనే ఓ పాటని చిత్రీకరించనున్నారు. ఇందులో రష్మీ కనిపించనుందని సమాచారం. మెగాస్టార్ తో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసిందట రష్మీ. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ పాటలో కనిపిస్తుందని అంటున్నారు. ఆమె ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రష్మీకి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తుంది. 

 

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చిరుకి చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 


 


 




Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి