దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 7,579 కేసులు నమోదుకాగా 236 మంది మరణించారు. గత 543 రోజుల్లో ఇదే కనిష్ఠం. 12,202 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 3,45,26,480
  • ‬మొత్తం మరణాలు: 4,66,147
  • యాక్టివ్​ కేసులు: 1,13,584
  • మొత్తం కోలుకున్నవారు: 3,39,46,749

యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584 వద్ద ఉంది. గత 536 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.

గత 46 రోజులుగా రోజువారీ కేసులు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. గత 149 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి. రికవరీ రేటు 98.32గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.

కేరళ..

కేరళలో కొత్తగా 5,080 కేసులు నమోదయ్యాయి. 196 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,89,175కు పెరిగింది. మరణాల సంఖ్య 37,495కు చేరింది. గత 24 గంటల్లో 53,892 శాంపిళ్లు పరీక్షించారు.

మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 873 కేసులు నమోదయ్యాయి. కోజికోడ్ (740), తిరువనంతపురం (621) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో 656 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది మృతి చెందారు. 

Also Read: Nizamabad: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..

Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్

Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  

Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి