కొవిడ్ నుంచి కోలుకున్న కీర్తీ సురేష్ మలయాళ సినిమా 'వాషి' (Vaashi Movie) షూటింగ్ పూర్తి చేశారు.  ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించిన బ్యాలన్స్ పార్ట్ ఫినిష్ చేశారు. అలాగే, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. 'వాషి' తనకు ఎంతో స్పెషల్ అని కీర్తీ సురేష్ (Keerthy Suresh) అంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ సినిమాను నిర్మిస్తున్నది ఆమె తండ్రి జి. సురేష్ కుమార్.
కీర్తీ సురేష్ తల్లి మేనక హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఆమె తండ్రి సురేష్ కుమార్ ప్రొడ్యూసర్. కీర్తీ సురేష్ సోదరి రేవతి పేరు మీద రేవతి కళామందిర్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించారు.  మలయాళంలో పాతిక సినిమాలకు పైగా నిర్మించారు. తొలిసారి తన తండ్రి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో కీర్తీ సురేష్ నటించారు. 'వాషి' షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆమె "నా హృదయంలో 'వాషి' సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మా నాన్న నిర్మాణంలో నటించడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. ఈ సెట్‌లో జ్ఞాప‌కాల‌ను  ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాను. టోవినో థామస్ అమేజింగ్ కో -స్టార్" అని పేర్కొన్నారు. ఈ సినిమా దర్శకుడు విష్ణు రాఘవ్, కీర్తీ సురేష్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఆమెకు తెలుసు. ఈ సినిమా స్పెషల్ అని చెప్పడానికి అదీ ఓ కారణం.






Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి