కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి... సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత మరొకరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఓ వైపు కరోనా బారిన పడిన ప్రముఖులు కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తుంటే... మరోవైపు కొత్తగా వైరస్ బారిన పడుతున్న ప్రముఖులూ ఉంటున్నారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా కరోనా బారిన పడ్డారు. హలో ఫ్రెండ్స్... నాకు కొవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ దరిద్రాన్ని సీరియస్గా తీసుకోండి అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ ఫలక్నుమా దాస్ లో నటించారు. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా చేశారు. దర్శకుడిగా మూడో సినిమాకు తరుణ్ స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. ఇటీవలే ఆయన కొత్త ఆఫీసు ప్రారంభించారు. గురువారమే తరుణ్ భాస్కర్కు కొవిడ్ సోకింది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా తనకు కొవిడ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.నటి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. ఆహా ఓటీటీలో విడుదలైన సేనాపతి సినిమాలో ఆమె నటించారు. అలాగే, తెలుగులో సీరియల్స్ కూడా చేస్తున్నారు. Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతుAlso Read: జనవరి 20 ఎపిసోడ్: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా... 'గుప్పెడంత మనసు' గురువారం ఎపిసోడ్...Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Tharun Bhascker: ఫ్రెండ్స్... ఆ దరిద్రాన్ని (కొవిడ్ను) సీరియస్గా తీసుకోండి! - తరుణ్ భాస్కర్
ABP Desam | 21 Jan 2022 07:01 AM (IST)
కొవిడ్ను సీరియస్గా తీసుకోమని దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ చెబుతున్నారు.
తరుణ్ భాస్కర్