Newly-Wed Couple Murder : ప్రేమ కథల్లో ఎన్నో విషాదాంతాలు ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చచ్చిపోవడమో.. హత్యకు గురవడమో జరుగుతూ ఉంటాయి. ఇాలాంటి ఘటనలకు కారణాలు చాలా ఉంటాయి. కులం, మతం, ఆస్తులు, అంతస్తులు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. అందుకే ఇలాంటి కారణాల స్టోరీలతోనే సినిమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ తమిళనాడులో  జరిగిన కొత్త దంపతుల హత్యకు కారణం మాత్రం ఎవరూ ఊహించనిది. పైగా హత్య చేసింది కూడా ఎవరో కాదు  అమ్మాయి తండ్రి. తన కుమార్తెతో పాటు అల్లుడ్ని కూడా నరికి చంపేశాడు ఆ తండ్రి. ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి ?


బీచ్‌లో సరదాగా భార్యాభర్తలు, వెనక్కి తిరిగిచూసేసరికి ఆమె మిస్సింగ్! మిస్టరీగా కేసు


తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతర కులం యువకుడా అంటే కానే కాదు.. అదే కులానికి చెందిన యువకుడు. పోనీ బయట వ్యక్తా అంటే కాదు..దగ్గరి బంధువే. ఆస్తి పాస్తుల్లో తేడాలున్నాయా అంటే అదీ కాదు.. రెండు కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలే. మరి ఎందుకు చంపేశాడు అంటే.. చదువు కారణం. చదువుకోలేక నిరక్ష్య రాస్యుడైన కారణంగా చంపేయలేదు.. తన కుమార్తె కాలేజీ చదువు చదువుకుందని..  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు హైస్కూల్ వరకే చదువుకున్నాడని.. ఇలా తక్కువ చదువుకున్న యువకుడు ఎక్కువ చదువుకున్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని కక్ష గట్టి .. పరువు తక్కువగా భావించి ఇద్దరీ హత్య చేసేశాడు .


దారి తప్పిన స్నేహం- 15 ఏళ్ల పిల్లాడితో 28 ఏళ్ల మహిళ జంప్!


తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రేమికులిద్దరూ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదని బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.  వివాహం అనంతరం తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ జంటను స్టేషన్‌కు పిలిపించారు. ఇష్ట ప్రకారం పెళ్లి చేుకున్నామని తాము మేజర్లమంటూ ఆ జంట మధురై పోలీస్‌లకు తెలిపింది. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో విచారణ జరిగిందని, వారిని ఇబ్బంది పెట్టవద్దంటూ గ్రామ పెద్దలు హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రి వారిని నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లంగిపోయాడు. 


ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ కథ- కొడుకును ముక్కలుగా నరికి పారేసిన తండ్రి!


కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు కానీ.. ఆమె మనసును మాత్రం గుర్తించలేకపోయాడు. కానీ చదువు తక్కువ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం పరువు తక్కువగా భావించాడు. చివరికి ప్రాణం తీసి రాక్షసుడయ్యాడు.