రెస్టారెంట్లు, షాపింగ్​ మాల్స్, ట్రయల్​ రూమ్స్ ఇలా.. ఏ చోటకు వెళ్లినా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మూలన ఏ కెమెరా ఉందోనని ఆందోళనలో బతకాల్సి వస్తుంది. అయితే ఇళ్లలోనూ అభద్రతతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంతమంది చేసే పనులే దీనికి కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటన అలాంటిదే.. 


హైదరాబాద్ ఫిలింనగర్ లో ఓ మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్‌ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఈ విషయాన్ని మహిళ గమనించింది... వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పింది.


మీ కుమారుడు ఇలా చేస్తున్నాడంటూ.. ఇంటి యజమానికి దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. అయితే యజమాని కుటుంబ సభ్యులు తమ వాడు అలాంటి వాడు కాదండూ.. బుకాయించారు.  ఇక చేసేదేమీ లేక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువకుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు దిలీప్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు నెలల నుంచి.. మహిళ బాత్ రూమ్ లో స్తానం చేస్తున్నప్పుడు వీడియో తీసినట్టు.. నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు.


ఇటీవలే.. జూబ్లీహిల్స్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ షాపింగ్ మాల్‌లో యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు సీక్రెట్‌గా వీడియో తీశారు. ఈ విషయాన్ని యువతి గమనించింది. గట్టిగా కేకలు వేసింది. మాల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆపై 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


Also Read: Odisha School : సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?


Also Read: Hyderabad Crime: సోలార్ ప్లాంట్ పేరుతో సౌదీ స్నేహితులకు కుచ్చుటోపీ... ప్లాంట్ పెట్టకుండా రూ.12 కోట్లు కొట్టేశాడు


Also Read: Hyderabad: రెండేళ్లుగా మరో మహిళతో సీక్రెట్ సహజీవనం... సీన్ కట్ చేస్తే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు...


Also Read: Vijayawada Crime: అట్టిక గోల్డ్ కంపెనీలో చోరీ... ఇంటి దొంగ పనే... రెండు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు


Also Read: Hyderabad: నా భర్త సైకోలా వేధించాడు... సూసైడ్ నోట్ రాసి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి