రాజేంద్ర నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది.  ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. భర్తపై కోపంతో పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు దొరికిన లేఖ ద్వారా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భార్య భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం భర్తతో మరోసారి గొడవ జరగడంతో... భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత పిల్లల్ని చంపి ఆత్మహత్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 


Also Read: అట్టిక గోల్డ్ కంపెనీలో చోరీ... ఇంటి దొంగ పనే... రెండు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు


సూసైడ్ నోట్ రాసి


రాజేంద్ర నగర్‌లో  ఇద్దరు కన్నబిడ్డలను చంపి, తను కూడా ఆత్మహత్య చేసుకుందో తల్లి. స్వాతి అనే మహిళ తన ఇద్దరు అమ్మాయిలు శ్రేయ, తన్వికి ఉరివేసి చంపింది. ఆ తరువాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. భర్త సాయి కుమార్‌ పై కోపంతోనే  పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్వాతి సూసైడ్‌ లేఖలో రాసింది. హైదరాబాద్ లో సాయి కిరణ్‌, స్వాతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. గొడవ అనంతరం సాయి కిరణ్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇద్దరు పిల్లల్ని చంపి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లే చనిపోతున్నట్లు స్వాతి సూసైడ్‌ నోట్‌ రాసింది. తన భర్త సాయికుమార్‌ సైకోలా వేధించాడని, ప్రతీదానికి అనుమానపడేవాడని సూసైడ్ లేటర్ స్వాతి రాసింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది. 


పెళ్లైన ఆరు నెలలకే దారుణ హత్య


హైదరాబాద్‌‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు భార్యను కడతేర్చిన ఘటన జరిగిన మరుసటి రోజే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లయిన ఆరు నెలలకే భార్యను హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టాబ్యారేజీ గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదే విధంగా ఒడిశాలోని గురండి మండలానికి చెందిన భాస్కర్‌ రావు కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ రెండు కుటుంబాలు మూసాపేటలో నివాసం ఉంటున్నాయి. వీరికి పరిచయం ఉన్న కుటుంబాలే కావడంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. భాస్కర్‌ రావు, కనకమ్మ దంపతుల చిన్న కుమార్తె శిరీషను కన్నయ్య కుమారుడు సంతోష్‌కు ఇవ్వాలని నిశ్ఛయించారు. మే 30న శిరీష, సంతోష్‌ల వివాహం ఘనంగా జరిపించారు. 


భార్య శిరీషపై అనుమానం పెంచుకున్న సంతోష్ నిత్యం ఆమెను వేధించసాగాడు. విషయం పెద్దల వరకు వెళ్లడంతో రెండు పర్యాయాలు పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చారు. కానీ సంతోష్ ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అదే అతడి భార్య పాలిట శాపంగా మారింది. భార్యపై అనుమానం మరింత పెంచుకున్న అతడు శిరీషను హత్య చేయాలని భావించాడు. గురువారం భార్యను హత్య చేసి తనకు ఏమీ తెలియదన్నట్లుగా బయటకు వెళ్లిపోయాడు. వీరికి బంధువులు ఫోన్ చేయగా ఎవరూ స్పందించడం లేదని అనుమానమొచ్చి ఇంటికి వెళ్లి చూశారు. తాళం వేసి ఉంది. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తాళం పగలగొట్టి చూడగా విగతజీవిగా పడి ఉన్న శిరీష వారికి కనిపించింది. భార్యను హత్య చేసి సంతోష్ ఎక్కడికో వెళ్లిపోయాడని, అందుకు ఫోన్ తీయడం లేదని అర్థమవుతోంది.


Also Read: రెండేళ్లుగా మరో మహిళతో సీక్రెట్ సహజీవనం... సీన్ కట్ చేస్తే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి