Petrol Price Today In Hyderabad: గత రెండు వారాలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన  వాహనదారులకు నేడు ఊరట కలిగించాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ప్రస్తుతం రోజువారీగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 8th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్‌‌పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.105.02 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో 3 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.18 కాగా, డీజిల్‌‌‌పై 3 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. నేడు కరీంనగర్‌లో 30 పైసలు పెరిగి, పెట్రోల్ ధర రూ.119.64 కాగా, 13 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.105.36కు చేరింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 9 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.23 కాగా, డీజిల్‌‌పై 8 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.11కి దిగొచ్చింది.  


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 8th April 2022)పై 75 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.121.81 కాగా, ఇక్కడ డీజిల్ పై 70 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.38 కి చేరింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. 81 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.106.42గా ఉంది.
చిత్తూరులో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ లీటర్ రూ.122.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.107.57 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 


Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు మళ్లీ షాక్ - పెరిగిన బంగారం, వెండి ధరలు, నేడు ఎంత పెరిగిందంటే !


Also Read: Weather Updates: తగ్గేదేలే అంటున్న సూర్యుడు - అగ్నిగుండంలా మారిన రాయలసీమ, తెలంగాణలో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు