దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో కొంత కాలంగా స్థిరంగా ఉంటున్న ఇంధన ధరలలో తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొద్ది రోజులుగా ధరలు స్థిరంగా ఉండగా తాజాగా వ్యత్యాసం కనిపిస్తోంది.


తెలంగాణలో అక్టోబరు 1న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో ఇంధన ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. నేడు పెట్రోల్ ధర రూ.0.26 పైసలు పెరిగి రూ.105.74 అయింది. డీజిల్ ధర రూ.0.32 పైసలు పెరిగి రూ.98.06 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.41 పైసలు పెరిగి రూ.105.43గా ఉంది. డీజిల్ ధర రూ.0.47 పైసలు పెరిగి రూ.97.77 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా భారీగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.26 పైసలు పెరిగి రూ.105.61గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు పెరిగి రూ.97.94కు చేరింది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.53 గా ఉంది. డీజిల్ ధర రూ.99.72 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటుండగా తాజాగా స్థిరంగా ఉన్నాయి.


Watch: పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్లతో దాడి.. బండ బూతులు తిట్టిన దుండగులు


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు భారంగా పెరిగాయి. ప్రస్తుతం రూ.108.67 గా ఉంది. ఏకంగా పెట్రోల్ ధర రూ.1.06 పెరగడం గమనార్హం. డీజిల్ ధర రూ.1.06 పెరిగి ఏకంగా రూ.100.39కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా భారీగా పెరిగింది.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.51గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.82 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.99.28కి పెరిగింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటుండగా.. తాజాగా రూ.0.80 పైసలకు పైబడి పెరుగుదల కనిపించింది.


Also Read: ఇంటిపై దాడులకు భయపడను.. చిరంజీవి మాట్లాడరా? పోసాని స్పందన.. ట్విస్ట్ ఇచ్చిన జనసేన నేత


తిరుపతిలో ఇంధన ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.90 పైసలు పెరిగి రూ.108.82 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.100.50గా ఉంది.


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 1 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్


Also Read: కుళ్లిన స్థితిలో నటి శవం.. గది నుంచి తీవ్ర దుర్వాసన, ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి