search
×

Stock Market: ఏడు రోజులుగా పెరుగుతున్న స్టాక్- ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!

Business News in Telugu: మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ కంపెనీ హిందుస్థాన్ జింక్ షేర్లు గడచిన 7 ట్రేడింగ్ సెషన్ల నుంచి వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు మార్కెట్లో కొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

FOLLOW US: 
Share:

Hindustan Zinc: దేశంలో ప్రస్తుతం లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో గత కొన్ని రోజులుగా క్యూ4 ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. మార్కెట్లను నడిపించటంలో కంపెనీల లాభాల ప్రకటనలు సైతం కీలకంగా మారాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్, బోనస్ షేర్లు ప్రకటిస్తూ తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తున్నాయి.

ఇప్పుడు మనం చూస్తున్నది మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలో కొనసాగుతున్న హిందుస్థాన్ జింక్ కంపెనీ గురించే. వరుసగా స్టాక్ 7వ ట్రేడింగ్ రోజున తన ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచేసింది. అయితే స్టాక్ వరుస పెరుగుదల, రాకెట్ దూకుడుకు కారణం చాలా మందికి తెలియదు. వారాంతంలో మార్కెట్లు భారీ క్షీణతకు గురైనప్పటికీ హిందుస్థాన్ జింక్ మాత్రం తన ర్యాలీని కొనసాగిస్తూనే ఉంది. ఇంట్రాడేలో నేడు స్టాక్ దాదాపు 7 శాతం లాభపడి రూ.464 స్థాయికి చేరుకుంది. ఇది స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర కావటం గమనార్హం. ఈ స్టాక్ 2024లో ఇప్పటివరకు దాదాపు 44 శాతం లాభపడింది.

తాజాగా మైనింగ్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. అయితే డివిడెండ్ ప్రకటన మే 7న ఉండగా.. ఇందుకోసం రికార్డు తేదీని కంపెనీ మే 15గా ప్రకటించింది. ఈ వివరాలను స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్లపై మధ్యంతర డివిడెండ్‌ నిర్ణయం కోసం బోర్డు డైరెక్టర్లు మే 7న సమావేశం కానున్నారు. వాస్తవానికి కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు డిసెంబరులో అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై కంపెనీ రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు ఏకంగా రూ.75.50 ఫైనల్ డివిడెండ్ ప్రకటించి ఇన్వెస్టర్లను ధనవంతలు చేసేసింది. డివిడెండ్ ఆదాయం కోసం షేర్లను హోల్డ్ చేస్తున్న చాలా మంది కంపెనీ ప్రకటనతో గత ఆర్థిక సంవత్సరంలో మంచి రాబడులను అందుకున్నారు.

ఇక కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వేదాంత గ్రూప్ కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లాభాలు ఏడాదికి 21 శాతం క్షీణతను నమోదు చేసింది. వాస్తవానికి దీనికి నెమ్మదిగా కొనసాగుతున్న డిమాండ్ పెరుగుదల కారణంగా ఉంది. సరఫరా పేరిగినంత వేగంగా డిమాండ్ మార్కెట్లో పెరగటం లేదని కంపెనీ తన ఆర్థిక ఫలితాల ప్రకటనలో పేర్కొంది. దీంతో కంపెనీ నికర లాభం క్యూ4లో రూ.2,038 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.7,285 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో ఆదాయం సైతం 12 శాతం క్షీణతను చవిచూసింది. ఇదిలా ఉండగా కంపెనీలో 29.54 వాటాతో మైనారిటీ ఇన్వెస్టర్ గా కొనసాగుతున్న భారత ప్రభుత్వం కంపెనీలోని తన పెట్టుబడులను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని చూస్తోంది. అయితే భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుందోనని కంపెనీలోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Published at : 03 May 2024 05:32 PM (IST) Tags: Buzzing stock Hindustan Zinc Dividend Stock Vedanta Group Trnding stock

ఇవి కూడా చూడండి

ITR Filing: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్‌ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం

ITR Filing: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్‌ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం

SIP Risk: సిప్‌ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్‌ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి

SIP Risk: సిప్‌ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్‌ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి

Gold Price At All Time High: 40 రోజుల్లో 10 రికార్డులు బద్ధలు - నాలుగు రోజుకో కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసిన గోల్డ్‌

Gold Price At All Time High: 40 రోజుల్లో 10 రికార్డులు బద్ధలు - నాలుగు రోజుకో కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసిన గోల్డ్‌

Gold-Silver Prices Today 11 Feb: బ్రేకుల్లేని పసిడి బండి, మళ్లీ కొత్త రికార్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 11 Feb: బ్రేకుల్లేని పసిడి బండి, మళ్లీ కొత్త రికార్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

LIC Portfolio Shares: ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు ఇవీ - మీ దగ్గర కూడా ఇవి ఉన్నాయా?

LIC Portfolio Shares: ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు ఇవీ - మీ దగ్గర కూడా ఇవి ఉన్నాయా?

టాప్ స్టోరీస్

Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?

Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?

Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్

Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్

Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం

Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం