డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం గురువారం స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవోగా భావించిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ అనుకున్నంత హిట్టవ్వలేదు! రూ.2150 ఇష్యూ ధరతో పోలిస్తే 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1,950 వద్ద మార్కెట్లో నమోదైంది. కాగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లుగా ఉంది.






గురువారం ఉదయం పది గంటలకు పేటీఎం లిస్టైంది. స్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ అతడి కుమారుడు బీఎస్‌ఈలో లిస్టింగ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. 9 శాతం డిస్కౌంట్‌తో నమోదైన షేర్ల ధర ఆ తర్వాత మరింత పడిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో రూ.1600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని రూ.450 నష్టంతో రూ.1700 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


పేటీఎం మార్కెట్లో నమోదైన వెంటనే సీఈవో విజయ్ శేఖర శర్మ ట్వీట్‌ చేశారు. 'యువ భారత ఆశలను స్టాక్‌ మార్కెట్‌ వైపు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది' అని అన్నారు. 'మన క్రికెట్‌ జట్టు గురించి నేను ఫీలవుతున్నా! చాలా సందేశాలు, అభినందనలు, ప్రోత్సాహపూరిత మాటలు వస్తున్నాయి. యువ భారత ఆశలను స్టాక్‌ మార్కెట్‌ వైపు నడిపిస్తున్నట్టుగా అనిపించింది. బొగ్గు నుంచి ఫిన్‌టెక్‌ వరకు 11 ఏళ్లలో భారత్‌ ఎంతో పరివర్తన చెందింది. ప్రతి పేటీఎం యూజర్‌ ఇండియాను ఎంతగానో మార్చేశాడు' అని విజయ్‌శేఖర్‌ అన్నారు.


పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌కు 1.66 రెట్ల స్పందన లభించింది. 87 లక్షల షేర్లను వారికి కేటాయించారు. ఈక్విటీ కింద రూ.8,300 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.10,000 కోట్ల షేర్లను విక్రయించారు.


Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?


Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి


Also Read: Petrol-Diesel Price, 18 November: వాహనదారులకు ఊరట.. ఇక్కడ స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి