search
×

Stock Market Closing Bell 19 September 2022: నారో రేంజ్‌లో మార్కెట్ల మూమెంట్‌, యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయం కోసం వెయిటింగ్‌

అమెరికన్ సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకునే నిర్ణయం కోసం వెయిట్‌ చేస్తుండడంతో, నారో రేంజ్‌లోనే మార్కెట్లు మూవ్‌ అయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 19 September 2022: ఇవాళ (సోమవారం) న్యూట్రల్‌గా ప్రారంభమైన భారత స్టాక్‌ మార్కెట్లు, రోజు మొత్తం ఒడిదొకుల్లోనే ట్రేడయ్యాయి. మంగళవారం ప్రారంభం కానున్న యూఎస్‌ ఫెడ్‌ సమావేశం ప్రభావం ఇవాళ మన మార్కెట్‌లో అతి కొద్దిగా కనిపించింది. గ్లోబల్‌గా వీక్‌ సిగ్నల్స్‌ వస్తున్నా, మన పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, అమెరికన్ సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకునే నిర్ణయం కోసం వెయిట్‌ చేస్తుండడంతో, నారో రేంజ్‌లోనే మార్కెట్లు మూవ్‌ అయ్యాయి. 

BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,840 పాయింట్ల  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ (సోమవారం) 93 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 58,747 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 58,487.76 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకింది. 59,277.55 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 300.44 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 59,141.23 వద్ద ముగిసింది. మొత్తంగా చూస్తే, కనిష్ట స్థాయి నుంచి 650 పాయింట్లు పుంజుకుంది.

NSE Nifty
శుక్రవారం 17,530 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 10 పాయింట్లు లేదా 0.06 శాతం లాభంతో 17,540 పాయింట్ల వద్ద ఓపెనైంది. 17,429.70 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,667.20 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 91.40 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 17,622.25 వద్ద ముగిసింది. 

Nifty Bank
శుక్రవారం 40,776 పాయిట్ల వద్ద ముగిసిన ఈ సూచీ, ఇవాళ 91 పాయింట్లు లేదా 0.22 శాతం నష్టంతో 40,985 పాయింట్ల వద్ద మొదలైంది. 40,509.90 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని తాకింది. 41,184.25 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 127.60 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 40,904.40 వద్ద ముగిసింది.

Top Gainers and Lossers
నిఫ్టీ50లోని 35 కంపెనీలు లాభాల్లో ముగియగా, 15 కంపెనీలు నష్టాల్లో క్లోజయ్యాయి. ఎం&ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌ లాభాల్లో కళకళలాడగా... టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, కోటక్‌ బ్యాంక్‌ నష్టాల్లో విలవిల్లాడాయి. నిప్టీ మెటల్‌, రియాల్టీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ తప్ప మిగిలిన సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి.

ఈ నెల 20, 21 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (యూఎస్‌ ఫెడ్‌) మానిటరింగ్‌ పాలసీ కమిటీ సమావేశం ఉంది. వడ్డీ రేట్లను యూఎస్‌ ఫెడ్‌ ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచుతుంది, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్‌ ఇస్తుంది అన్నదానిపై ఈ రెండు రోజులు ప్రపంచ మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. భారత కాలమానం ప్రకారం, బుధవారం అర్ధరాత్రి ఫెడ్‌ నిర్ణయం వెలువడేంత వరకు, మన మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ ఊగిసలాట ఉండొచ్చు. 75 బేసిస్‌ పాయింట్లను అంచనా వేసిన మన మార్కెట్‌, దానికి అనుగుణంగా ఇప్పటికే సర్దుబాటుకు గురైంది. ఒకవేళ 100 బేసిస్‌ పాయింట్ల పెంపుపై నిర్ణయం వస్తే మాత్రం, మార్కెట్లు మరింత జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పెట్టుబడిదారులు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 19 Sep 2022 04:31 PM (IST) Tags: sensex Nifty Share Market Nifty Bank Stock Market

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు

IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు

Hyderabad Road Accident: జూబ్లీహిల్స్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి కారు బీభత్సం, డ్రైవర్‌కు తీవ్రగాయాలు - మద్యం మత్తే కారణమా?

Hyderabad Road Accident: జూబ్లీహిల్స్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి కారు బీభత్సం, డ్రైవర్‌కు తీవ్రగాయాలు - మద్యం మత్తే కారణమా?

Telugu TV Movies Today: చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ to పవన్ ‘జల్సా’, మహేష్ ‘సర్కారు వారి పాట’ వరకు - ఈ సోమవారం (మార్చి 17) టీవీలలో వచ్చే సినిమాలివే

Telugu TV Movies Today: చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ to పవన్ ‘జల్సా’, మహేష్ ‘సర్కారు వారి పాట’ వరకు - ఈ సోమవారం (మార్చి 17) టీవీలలో వచ్చే సినిమాలివే

AP Pensions: పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్

AP Pensions: పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్