Cryptocurrency Prices Today, 3 December 2021: టాప్‌ క్రిప్టో కరెన్సీలు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బిట్‌కాయిన్‌ను ఎక్కువగా విక్రయిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో ఇది 0.48 శాతం తగ్గి రూ.44,85,618 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్‌ విలువ రూ.79,83,390 కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరెమ్‌ 0.29 శాతం తగ్గి రూ.3,62,167 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.39,71,847కు చేరుకుంది.



బైనాన్స్‌ కాయిన్‌ 0.46 శాతం తగ్గి రూ.49,224, టెథెర్‌79.56 శాతం తగ్గి రూ.79.56, సొలానా 1.91 శాతం పెరిగి రూ.18,452, కర్డానో 6.90 శాతం పెరిగి రూ.133, రిపుల్‌ 0.06 శాతం పెరిగి రూ.77.55 వద్ద కొనసాగుతున్నాయి. కాస్మోస్‌, డిస్ట్రిక్‌ఓఎక్స్‌, క్వాంట్‌స్వాప్‌, డియా, స్టెలార్‌, టెర్రా లాభాల్లో.. పవర్‌లెడ్జ్‌, వేవ్స్‌, అవలాంచె, ఆల్‌రాండ్‌, గోలెమ్‌ వంటివి నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?


క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి


భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!


Also Read: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుంటే పన్ను పడతాది!


Also Read: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్‌ తెలుసా?


Also Read: ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!


Also Read: త్వరపడండి..! ఈ గవర్నమెంట్‌ కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8.77% వడ్డీ ఇస్తోంది


Also Read: కస్టమర్లకు బ్యాంకుల షాక్‌..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు


Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి