ప్రైవేటు వ్యక్తులు కొత్తగా వేసే లే - అవుట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిబంధన విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్తగా వేసే లే - అవుట్లలో 5 శాతం స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలని నిబంధన విధించింది. అలా సాధ్యం కాదనుకున్న పక్షంలో ఆ లే - అవుట్ ప్రాథమిక విలువపై సదరు స్థలానికి డబ్బులైనా చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. ఈ మేరకు 2017 లే - అవుట్‌, సబ్‌ - డివిజన్‌ నిబంధనలను సవరించారు.


ప్రస్తుతం ప్రతి లే - అవుట్‌లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్నారు. అది కాకుండా మరో 5 శాతం అదనంగా స్థలాన్ని ఇకపై కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ వివరించింది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లే - అవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 


లేదంటే సదరు 5 శాతం స్థలం లే - అవుట్‌కు 3 కిలో మీటర్ల లోపు అయినా ఇవ్వొచ్చు. లే - అవుట్‌లో 5 శాతం స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాదనుకుంటే అక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని పురపాలకశాఖ జీవోలో పేర్కొంది. స్థలం ఇవ్వాలని లేకుంటే లే - అవుట్‌లో ప్రాథమిక విలువపై (బేసిక్‌ వాల్యు) 5 శాతం స్థలానికి సరిపడ డబ్బులు చెల్లించొచ్చు. స్థలం లేదా డబ్బును జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని పురపాలకశాఖ పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.


Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..


Also Read: East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...


Also Read: East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో


Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి