ఆంధ్రప్రదేశ్ లోని కరెంటు పరిస్థితులపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సమీక్షించారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌సహా పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సమీక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా రాష్ట్రానికి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. 




Also Read: గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్


పెరిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి


రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని సీఎం జగన్ తెలిపారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం అన్నారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. 






Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?


విద్యుత్ ఉత్పత్తిపై దీర్ఘకాలిక వ్యూహాలు


పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలన్న సీఎం... 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టు పైనా దృష్టిపెట్టాలన సీఎం ఆదేశించారు.  ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 


Also Read:  "మా" వివాదం కొనసాగింపు "మంచు" వ్యూహమా ? మీడియాతో మాట్లాడవద్దని చెబుతూ తామే ఎందుకు రచ్చ చేస్తున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి