ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,065 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 138 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,445కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 118 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,788 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,157 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,390కి చేరింది. గడచిన 24 గంటల్లో 118 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,445కు చేరింది. 


Also Read:  ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు


భారత్ లో కేసులు


దేశంలో కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 9,216 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 99,976 వద్ద ఉంది.  గత 24 గంటల్లో 8,612 మంది కరోనా నుంచి రికవరయ్యారు. 



  • మొత్తం కేసులు: 34,61,5,757‬

  • మొత్తం మరణాలు: 4,70,115

  • యాక్టివ్​ కేసులు: 99,976

  • మొత్తం కోలుకున్నవారు: 3,40,45,666


Also Read: ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై ప్రభావవంతంగా పనిచేసేది కోవాక్సినే... చెబుతున్న ఐసీఎమ్ఆర్ అధికారులు


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.29గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.35%గా ఉంది. గత 60 రోజులుగా డైలీ పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువే ఉంది. ప్రస్తుతం 0.80 శాతం ఉంది.  ఇప్పటివరకు 64.46 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. 


వ్యాక్సినేషన్..


దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గురువారం 73,67,230 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 1,25,75,05,514కు చేరిందని స్పష్టం చేసింది.  


Also Read:  'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి