ఈ మధ్య నీరు తాగాలన్నా, వేడి వేడి టీ, కాఫీలు తాగాలన్నా పేపర్ కప్స్ తెగ వాడేస్తున్నాం.

అయితే, ఇకపై పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు తాగే ముందు ఒకసారి ఆలోచించండి.

ఎందుకంటే.. పేపర్ కప్‌ల్లో వేడి వేడి ద్రావణాలు తాగడం చాలా డేంజర్.

పేపర్ కప్పు లోపల హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పొర ఉంటుంది. తడి వల్ల పేపర్ కప్పు పాడవుకుండా కాపాడుతుంది.

ఆ పొర వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్ ఐఐటీ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

పేపర్ కప్పులలో రోజుకు 3 సార్లు 100 మి.లీ. వేడి టీ తాగితే.. 75 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరతాయట.

ఆ హానికర ప్లాస్టిక్ కణాల వల్ల భయానక రోగాలు వస్తాయట.

వేడి వేడి టీ ఆ పేపర్ కప్పులో పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ పొర కరిగి కడుపులోకి చేరుతుంది.

కాబట్టి, ఇకపై పేపర్ కప్పుల్లో వేడి వేడి టీ, కాఫీలు తాగడం మానేయండి. నీళ్లు తాగాలన్నా, ఒక్కసారి కడిగి తాగండి.

Image Source: Images Credit: Pexels and Pixabay

వేడి వేడి టీ, కాఫీలు తాగేందుకు స్టీల్ లేదా గాజు గ్లాసులనే వాడండి.

Images Credit: Pexels and Pixabay