అల్పాహారం తినకపోతే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందట !

క్యాన్సర్ కాకుండా ఇంకా చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

రోజూ అల్పాహారం తినకపోతే టైప్-2 డయాబెటీస్ ప్రమాదం ఉంది.

పొద్దున్న ఏమీ తినకపోతే సాయంత్రం లేదా రాత్రి సమయంలో అతిగా తినే అవకాశం ఉంది.

దానివల్ల క్యాలరీలు ఎక్కువగా పొంది బరువు పెరుగుతారు.

ఈ విధంగా బరువు పెరిగినవారికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

రక్తపోటు స్థాయిని పెంచడం, తలనొప్పి, మైగ్రేన్, జుట్టు రాలడం వంటివి జరుగుతాయి.

అల్పాహారం తిననివారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం వలన మీరు రోజంతా చురుకుగా ఉంటారు.