హిందూపురం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు.

ఓ మహిళ ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు.

వెంటనే స్పందించిన బాలయ్య.. వద్దు అని ఆమెను వారించి, నమస్కారం పెట్టారు

పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాలకృష్ణ, బాధితులను తమ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు

అనంతరం పోచనపల్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు.

తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందడం లేదని బాలకృష్ణకు తెలిపారు.

రోజుల తరబడి గడుపుతున్నా.. తమకు సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు.

తమ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు బాలకృష్ణ

టీడీపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు