Image Source: IPL Twitter

ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్తాన్ రాయల్స్ థంపింగ్‌ విక్టరీ సాధించారు.

204 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 131/8కే పరిమితం చేశారు.



72 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించారు.



యుజ్వేంద్ర చాహల్‌ (4/17), ట్రెంట్‌ బౌల్ట్‌ (2/21) దెబ్బకు రైజర్స్‌ విలవిల్లాడారు.



అబ్దుల్‌ సమద్‌ (32*), మయాంక్‌ అగర్వాల్‌ (27) టాప్‌ స్కోరర్స్‌ అంటేనే సిచ్యువేషన్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.



అంతకు ముందు రాజస్థాన్‌లో ఏకంగా ముగ్గురు అర్థ సెంచరీలు చేశారు.



ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (54), యశస్వీ జైశ్వాల్‌ (54), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (55) హాఫ్ సెంచరీలు బాదేశారు.



టార్గెట్‌ డిఫెండ్‌ చేసే జట్టుకు ఎలాంటి బౌలింగ్‌ స్పెల్‌ అవసరమో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసి చూపించాడు.



బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ హడలెత్తించాడు.



తన బంతులకు రైజర్స్ దగ్గర సమాధానం లేకపోయింది.