జాహ్నవి కపూర్ తన కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

మోడర్న్ నేవీ బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ ఫొటోలకు ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతున్నారు.

ఈ ఫొటోలపై ఆలియా భట్ కామెంట్ కూడా చేయడం విశేషం.

శ్రీదేవి, బోనీ కపూర్‌ల కూతురు అయిన జాన్వీ ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’లో మెప్పించింది.

తాజాగా ‘మిలీ’ అనే సినిమాలో నటించింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘హెలెన్’కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.

త్వరలో ఈమె తెలుగులో కూడా తెరంగేట్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కథానాయికగా జాన్వీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
(All Images Credits: Janhvi Kapoor Instagram)