కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది మంజిమా మోహన్.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేస్తూ గౌతమ్ గురించి గొప్పగా రాసింది.

ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, అభిమానులు మంజిమ, గౌతమ్ లకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

2019లో దేవరాట్టం సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

అప్పటినుంచి వీరిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని సమాచారం.

ఇప్పుడు వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
(All Image Credits: Manjima Instagram)