భూమి పెడ్నేకర్ తన కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

2015లో వచ్చిన ‘దం లగా హై కైసా’ సినిమాతో భూమి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

‘టాయిలెట్: ఏక్ ప్రేమ కథ’ తనకు మంచి గుర్తింపు అందించింది.

‘లస్ట్ స్టోరీస్’లో జోయా అక్తర్ కథలో నటించి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.

‘శాండ్ కీ ఆంఖ్’ వంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది.

తన నటనతో ఎన్నో అవార్డులు కూడా తన సొంతం చేసుకుంది.

మొదటి సినిమాకే ఏకంగా ఏడు అవార్డులు తన ఖాతాలో పడటం విశేషం.

ఆ తర్వాత ‘శాండ్ కీ ఆంఖ్’, ‘బాలా’ చిత్రాలకు కూడా తను అవార్డులు దక్కించుకుంది.

ఇటీవలే ‘రక్షాబంధన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.
(All Images Credits: Bhumi Pednekar Instagram)