ఆలయానికి వెళ్లినప్పుడు భగవంతుడి దర్శనం అనంతరం తీర్థం తీసుకుంటారు
తీర్థం, ప్రసాదం ద్వారా దేవుడి ఆశీస్సులు వస్తాయని భక్తుల విశ్వాసం
ఆలయాల్లో రద్దీ పెరగడంతో ఇప్పుడంటే ఓసారి తీర్థం ఇస్తున్నారు...
సాధారమంగా తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు
మొదటిసారి తీసుకున్న తీర్థం శరీర శుద్ధికి, శుచికి
రెండోసారి తీసుకున్న తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు
మూడోసారి తీసుకన్న తీర్థం పరమేశ్వరుడి పరమపదాన్ని చేరుకోవాలని..
అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!