తిరుమల హుండీలో ఎలాంటి ముడుపులు వేయాలి!

తిరుమల హుండీలో వేసే సొమ్ము 3 భాగాలుగా విభజిస్తారట శ్రీవారు

నిష్కామ పుణ్యధనం : పుణ్యమార్గంలో సంపాదించిన సొమ్ము - కోర్కెలు కోరుకోకుండా స్వామివారికి సమర్పించడం

పుణ్యధనం: పుణ్యమార్గంలో సంపాదించినదే కానీ...ప్రతిఫలం ఆశించి హుండీలో వేయడం

అన్యాయపు సొమ్ము: పాపాలు, మోసాలు చేసి సంపాదించిన సొమ్ము

నిష్కామ పుణ్యధనం, పుణ్యధనం..స్వామివారి సేవకు, సేవాకార్యక్రమాలకు వినియోగిస్తారు..

అన్యాయపు సొమ్ముతో స్వామివారికి కొనుగోలు చేసిన ఆస్తులపై మళ్లీ అక్రమార్కుల కన్ను పడుతోంది..

ఆ పాపం చేసిన వారే పాపాన్ని కడుక్కునేందుకు తిరిగి మొక్కులు, ముడుపుల రూపంలో సమర్పిస్తున్నారు

తిరుమలేశుడికి మీరు సమర్పించే ముడుపులు ఏ కోవకు చెందుతాయో ఓసారి ఆలోచించుకోండి...