వినాయకచవితి 2024: దేశంలో టాప్ 10 వినాయక ఆలయాలు!

Published by: RAMA

కాణిపాకం
కాణిపాకంలో వెలసిన వినాయకుడు సత్యప్రమాణానలకు నెలవు. తిరుమల వెళ్లిన భక్తులంతా కాణిపాకం స్వామివారిని దర్శించుకుంటారు

Image Source: Image Credit: Pinterest

సిద్ధి వినాయక దేవాలయం
ముంబైలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో సిద్ధి వినాయక దేవాలయం ఒకటి. ఇక్కడ గణేషుడి అష్టరూపాలను దర్శించుకోవచ్చు. గణేష్ చతుర్థి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి.

Image Source: Image Credit: Pinterest

మనకుల వినాయగర్ దేవాలయం
పుదుచ్చేరి లో ఉన్న ఈ ఆలయం బ్రిటీష్ వారి దండయాత్రల నుంచి బయపడి నిలిచింది. బీచ్ రోడ్ కి సమీపంలో ఉండే ఈ గణనాథుడి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడిపోతుంది.

Image Source: Image Credit: Pinterest

కురుడుమలై శక్తి గణపతి
బెంగళూరు సమీపం కోలూరు జిల్లాలో కొలువైన కురుడుమలై శక్తి గణపతి ఆలయంలో వినాయకుడిని త్రిమూర్తులు ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Image Source: Image Credit: Pinterest

త్రినేత్ర దేవాలయం
రాజస్థాన్ రణతంబోర్‌లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోనే అత్యంత పురాతన ఆలయంగా చెబుతారు. ఇక్కడ గణనాథుడు తన కుటుంబంతో సహా కొలువయ్యాడు. వినాయకుడు త్రినేత్రుడిగా భక్తులకు దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే..

Image Source: Image Credit: Pinterest

చింతమన్ గణేష్ ఆలయం
ఉజ్జయినిలో ఉన్న మహాకేళేశ్వరుడి ఆలయంలోనే కొలువయ్యాడు చింతమన్ గణేషుడు. రుద్రుడిని దర్శించుకునేముందే చింతమన్ గణేషుడిని దర్శించుకుంటే చింతలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.

Image Source: Image Credit: Pinterest

గణేష్ టోక్ టెంపుల్
గ్యాంగ్ టక్ లో ఉన్న గణేష్ టోక్ ఆలయం మార్గం మొత్తం జెండాలతో నిండి ఇంద్ర ధనస్సులా ఉంటుంది. ఇక్కడ లంబోదరుడిని దర్శించుకుంటే చేపట్టిన పనుల్లో విజయం తథ్యం అని భావిస్తారు.

Image Source: Image Credit: Pinterest

గణపతి పూలే ఆలయం
మహారాష్ట్ర రత్నగిరి జిల్లా సముద్రతీరంలో ఉంటుంది గణపతి పూలే ఆలయం. అగస్త్య మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. వినాయక నవరాత్రులు కన్నులపండువగా జరుగుతాయిక్కడ..

Image Source: Image Credit: Pinterest

మోతీ డుంగ్రీ
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న మోతీ డుంగ్రీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. బిర్లామందిర్ పక్కనే ఈ ఆలయం ఉంటుంది. గణపతి నవరాత్రులు వేడుకగా జరుగుతాయి ఇక్కడ

Image Source: Image Credit: Pinterest

దగ్దుషేత్ హల్వాయి గణపతి
ప్లేగు వ్యాధితో తన కుమారుడు మరణిస్తే...ఓ స్వీట్స్ వ్యాపారి నిర్మించిన ఆలయం దగ్ధుషేక్ హల్వాయి గణపతి. బంగారు ఆభరణాలతో కళకళలాడే ఇక్కడ పార్వతీ తనయుడిని దర్శించుకోవడం పూణే వెళ్లినవారు అస్సలు మిస్సవకండి

Image Source: Image Credit: Pinterest