చాణక్య నీతి: చేపల న్యాయం అంటే ఇదే

పాలకులు, పరిపాలన, ప్రజలకు జరగాల్సిన న్యాయం గురించి ఆచార్య చాణక్యుడు చేపల న్యాయం ప్రస్తావన తీసుకొచ్చారు

ఏ పాలకుడు అయితే ప్రజల్ని తీవ్రంగా దండిస్తాడో తనని ప్రజలు విపరీతంగా ద్వేషిస్తారు

ఏ పాలకుడు అయితే ప్రజల్ని ఏ తప్పుచేసినా విడిచిపెట్టేస్తాడో తనని లోకువగా చూస్తారు

ఏ పాలకుడు అయితే తన పర బేధం లేకుండా నేరానికి తగిన శిక్షను విధిస్తాడో తనని గౌరవిస్తారు

ఈసందర్భంగానే చేపలన్యాయం గురించి వివరించారు ఆచార్య చాణక్యుడు..ఏ రాజ్య/రాష్ట్రంలోనూ చేపల న్యాయం ఉండకూడదు

పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది..ఇదే చేపల న్యాయం

తప్పు చేసినవారికి పాలకుడు శిక్ష విధించకుండా ఊరుకుంటే సమాజంలో చేపలన్యాయం విజృంభిస్తుంది

ఎప్పుడైతే చేపలన్యాయం పెరుగుతుందో అది పాలకుడికి, రాష్ట్రానికి, దేశానికి అస్సలు మంచిది కాదు

చేసిన తప్పులకు పాలకులు సరైన శిక్ష విధించకపోతే...బలవంతుడితే రాజ్యం అవుతుందని వివరించారు ఆచార్య చాణక్యుడు