మీ ప్రవర్తనను నిర్ణయించేది మీరు చేసే భోజనమే!



టైమ్ టు టైమ్ తినేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఎలాంటి భోజనం చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయంటారు పండితులు



నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయి..అవి.. 1.అర్ధ దోషం, 2.నిమిత్త దోషం , 3.స్ధాన దోషం, 4.గుణ దోషం , 5. సంస్కార దోషం



1.అర్ధ దోషం
సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజిస్తే వచ్చేది అర్థదోషం అంటారు. ఈ దోషం వల్ల మీ బుద్ధి కూడా వక్రంగా మారుతుంది



2.నిమిత్త దోషం
చెడ్డ గుణాలు ఉన్నవారు ఇచ్చింది తినడం వల్ల మంచి గుణం నశించి నిమిత్త దోషం కలుగుతుంది. దీనివల్ల కళ్లఎదురుగా చెడు జరుగుతున్నా ఏం పట్టనట్టు వ్యవహరిస్తారు



3. స్ధాన దోషం
వంటచేసేవారు, వడ్డించేవారు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. అనవసర చర్చలు, వివాదాలు , అరుపులు కేకల మధ్య చేసిన వంట శరీరానికి మంచి చేయదు. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్ల వండిన వంటలు అంత మంచివి కాదంటారు పండితులు.



4.గుణ దోషం
మనం వండే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని మాయలో పడేస్తుంది,స్వార్థాన్ని పెంచుతుంది.



5. సంస్కారదోషం
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

దేవాలయానికి ఖాళీ చేతులతో వెళుతున్నారా!

View next story