భోజనం అయ్యాక ఇలాంటి పనులు చేస్తే ఆర్థిక నష్టం, కష్టాలు



చాలా మంది భోజ‌నం తర్వాత తిన్న కంచంలోనే చేతులు కడుక్కోవడం మీరు గమనించి ఉంటారు. మనం ఈ తప్పు చేస్తే ఆహార నియమాలను ఉల్లంఘించినట్లే, తినే ఆహారాన్ని అవమానించినట్లే.



ఇలా చేయడం వల్ల ఆహారం గౌర‌వం పోవడమే కాకుండా భవిష్యత్తులో దాని దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కంచంలో చేతులు కడుక్కోవడానికి బదులుగా, సింక్ వద్ద లేదా మ‌రో ప్రాంతంలో చేతులు కడుక్కోవాలి.



మత గ్రంథాల ప్రకారం, అన్నపూర్ణాదేవి ఆహారానికి అధి దేవత. ఆవిడ అనుగ్రహం వల్లనే మనకు ఆహారం లభిస్తుంది కాబట్టి భోజనం చేసే ముందు ఒకసారి ఆమెను స్మరించుకోవాలి. తిన్న తర్వాత అదే ప్లేటులో చేతులు కడుక్కోవడం అన్నపూర్ణా దేవిని అవమానించినట్లే.



ఆహారం తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం ద్వారా ఆ వ్యక్తికి అశుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి.జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, గ్రహాలు కూడా అతనికి వ్యతిరేకంగా సంచ‌రిస్తాయి.



తిన్న కంచంలో చేతులు కడుక్కునే వ్యక్తి పేదరికానికి గురవుతాడు. అలాంటి వ్యక్తులు జీవితంలో డబ్బు సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.



మత గ్రంథాలలో, మనం చేసే ప్రతి పనికి సంబంధించిన‌ నియమాలు స్ప‌ష్టంగా వివ‌రించారు. ఈ నియమాలు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనికి వర్తిస్తాయి.



గ్రంధాలలో ఆహారానికి సంబంధించిన అనేక నియమాలను మనం చూడవచ్చు. ఈ నియమాలలో కొన్ని ప్రతిరోజూ మనకు తెలియకుండానే విస్మరిస్తుంటాము.



మరో అంశం ఏమిటంటే, తిన్న తర్వాత కంచం అలా వ‌దిలేయ‌కూడ‌దు. భోజనం చేసిన వెంటనే కడిగి శుభ్రం చేయాలి.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

ఇంట్లో బల్లులు కనిపిస్తే ఏమవుతుంది!

View next story