పాలకూర తింటే కిడ్నీలు రాళ్లు పడతాయని అంటారు. మరి ఇందులో వాస్తవం ఏమిటీ?

ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలామంచిది. పాలకూర కూడా తినొచ్చు.

కానీ, పాలకూర అతిగా తింటే కిడ్నీలు రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

పాలకూరలో ఉండే అధిక కాల్షియం మూత్రంలో కాల్షియం విసర్జనకు ప్రేరేపిస్తుంది. అందుకే డేంజర్.

పాలకూరలో ఆక్సలేట్ శాతం ఎక్కువని, అందుకే రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర మూత్రంలో ఆక్సలేట్ పరిమాణం పెంచుతుంది. ఫలితంగా రాళ్లు ఏర్పడతాయి.

రాళ్లు అంటే సాధారణ రాళ్లు కావు. పాలకూరలో ఉండే కాల్షియం ఆక్సలేటే రాళ్లుగా ఘనీభవిస్తాయి.

అయితే, పాలకూరను ఉడకబెట్టి తింటే ఆక్సలేట్‌ ప్రభావం తగ్గుతుందట.

కాబట్టి, పాలకూరను అతిగా కాకుండా వారంలో ఒక్కసారి మితంగా తీసుకుంటే చాలు.

Images Credit: Pexels