పూజకు పనికిరాని పూలు ఏంటో తెలుసా?



భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. భక్తిపూర్వకంగా స్వామి-అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకుని కళ్లకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు.



పూజకు పనికిరాని పూలతో ముఖ్యమైనది మొగలిపువ్వు. బ్రహ్మని సపోర్ట్ చేస్తూ అబద్ధం చెప్పడంతో మొగలిపువ్వుకి శివుడి శాపం ఇస్తాడు.



మొగలిపువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు. వాసన వెగటుగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని ఇవ్వదు.



మొగలి పొదలు ఉన్నచోట పాములు తిరుగుతుంటాయి. వాటికి ఉండే కోర్కెలు, కోపం, పగ ..ఇలాంటివన్నీ మానువుల్లో కలుగుతాయని అందుకే మొగలిపూలు పూజకు పనికిరావని చెబుతారు.



ఎక్కువ వాసన వచ్చే పూలు సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజల్లో పెద్దగా వినియోగించరు.



బంతిపూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదుకానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు.



బంతిపూలకు క్రిమి కీటకాలను ఆకర్షించి, నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరతాయని వద్దంటారు. అందుకే ఎంట్రన్స్ లో కడతారు.



పురిటివారు, మైలవున్నవారు, బహిష్టులైనవారు పువ్వులను తాకరాదు.



క్రింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమచేత్తో కోసిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు



పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి.
బిల్వ దళాలు, తులసీ దళాలకు ఈ నియమాలు వర్తించవు



పురాణాలు, పండితులు ఇలా చేయకూడదని చెప్పారు కానీ ఇలా చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు. ఎందుకంటే ఏం చేసినా, ఎలా చేసినా భక్తిముఖ్యం అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.