మహిళల ఐపీఎల్‌లో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న ప్లేయర్‌గా స్మృతి మంథన నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెను రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

మహిళల బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున స్మృతి మంథన ప్రాతినిథ్యం వహించింది.

దీంతోపాటు అనేక లీగ్‌ల్లో కూడా ఆడింది.

టీ20ల్లో తన రికార్డు చాలా అద్భుతంగా ఉంది.

ఏకంగా 20 అర్థ సెంచరీలు అంతర్జాతీయ టీ20ల్లో సాధించింది.

రెండు వేల పరుగులు కూడా సాధించింది.

వన్డేల్లో ఐదు సెంచరీలు కూడా తన ఖాతాలో ఉన్నాయి.

టెస్టుల్లో కూడా ఒక సెంచరీ సాధించింది.

వన్డేలు, టెస్టుల్లో తన సగటు 40కి పైగా ఉండటం విశేషం.