న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్లతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

టీమిండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

భారత్ తరఫున సూర్యకుమార్ (26 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు.

దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది.

మూడో టీ20లో గెలిచిన జట్టు సిరీస్‌ను గెలుచుకోనుంది.

100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు.

లక్ష్యం తక్కువే కావడంతో భారత బ్యాటర్లు ఎక్కడా కంగారు పడలేదు.

న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ఉపయోగించాడు.

అందరూ పొదుపుగానే బౌలింగ్ వేశారు కానీ వికెట్లు తీయడంలో విఫలం అయ్యారు.