ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది శ్రియా శరన్.

దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది.

యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉండేది.

ఇప్పటికీ తన హాట్ ఫోటోలతో అందరినీ అలరిస్తుంటుంది.

2018లో ఆమె రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని అనుకున్నారు.

కానీ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారింది.

ఒక బిడ్డకు తల్లైనా.. శ్రియా అందం ఎంతమాత్రం తగ్గలేదు. 

ఎక్కువ సమయంలో తన ఫ్యామిలీతోనే గడుపుతుంటుంది శ్రియ. 

తాజాగా బీచ్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది శ్రియ.