ఐసీసీ టీ20 వరల్డ్‌ 2022లో తొలి సెమీస్‌కు వేళైంది.

ఐసీసీ టీ20 వరల్డ్‌ 2022లో తొలి సెమీస్‌కు వేళైంది.

గ్రూప్‌ 1 టాపర్‌ న్యూజిలాండ్‌, గ్రూప్‌ 2లోని పాకిస్థాన్‌ను ఢీకొడుతోంది.

సిడ్నీలో బుధవారం మధ్యాహ్నం 1:30కు మ్యాచ్‌ మొదలవుతుంది.

కివీస్‌ 5 మ్యాచుల్లో 3 గెలిచి, 1 ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లు 2.113 రన్‌రేట్‌తో నిలిచింది.

పాక్‌ 5 మ్యాచుల్లో 3 గెలిచి, 2 ఓడి 6 పాయింట్లు, 1.028 రన్‌రేట్‌తో సెమీస్‌ చేరింది.

ఈ రెండింట్లో కివీస్‌దే పైచేయి! చివరి 5 టీ20ల్లో పాక్‌ 4 సార్లు గెలిచింది.

కివీస్‌లో అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, కేన్‌, మిచెల్‌, నీషమ్‌ బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్నారు.

బౌల్ట్‌, సౌథీ, ఫెర్గూసన్‌ పేస్‌కు తిరుగులేదు, సోధి, శాంట్నర్ స్పిన్‌లో రాణిస్తున్నారు. నీషమ్‌, మిచెల్‌ ఆల్‌రౌండర్లు.

పాక్‌లో ఆజామ్‌ ఫామ్‌లో లేడు. రిజ్వాన్‌లో నిలకడ లేదు. ఇఫ్తికార్‌ అహ్మద్‌, హ్యారిస్‌ మిడిలార్డర్లో కీలకం.

అఫ్రిది, నసీమ్‌ షా, వాసిమ్‌, షాదాబ్‌ ఖాన్‌, రౌఫ్‌ బౌలింగ్‌ ఫర్వాలేదు. శ్రమిస్తే పాక్‌ గెలవగలదు.