Image Source: X\ Shree Jagannatha Temple, Puri

పూరీ ఆలయంలోని రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 46 ఏళ్ల తరవాత ఈ గదిని తెరవడం ఉత్కంఠగా మారింది.

Image Source: Instagram\odisha_tales

1978లో తొలిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. ఆ తరవాత మళ్లీ ఇప్పుడే ఈ రహస్య గది తలుపులు తెరుచుకోనున్నాయి.

తొలిసారి ఈ గదిని తెరిచినప్పుడు 70 రోజుల పాటు సిబ్బంది లోపల ఉన్న ఆభరణాలను లెక్కించి ఆ వివరాలు వెల్లడించింది.

Image Source: X\Shree Jagannatha Temple, Puri

ఈ భాండాగారం లోపల బంగారంతో పాటు వెండి, వజ్రాలు, ముత్యాలతో కూడిన రకరకాల ఆభరణాలు కనిపించాయి.

Image Source: X\Shree Jagannatha Temple, Puri

భాండాగారంలో మొత్తం 367 రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటి బరువు 4,360 గ్రాములుగా తేలింది.

Image Source: ABP Live

ఈ గదిలో 14,828 గ్రాముల బరువైన 231 వెండి వస్తువులు కనిపించాయి. మరో గదిలో 87 రకాల బంగారు ఆభరణాలున్నాయి.

Image Source: X\Shree Jagannatha Temple, Puri

రత్న భాండార్‌లో 12,831 గ్రాముల బంగారంతో పాటు 22,153 గ్రాముల వెండి ఉందని లెక్క తేల్చారు.

Image Source: X\Shree Jagannatha Temple, Puri

ఈ సంపద విలువ మొత్తం ఎంత అన్నది తేలలేదు. ఇప్పుడు మళ్లీ గది తెరిచి మిస్టరీని ఛేదించాలని బీజేపీ భావిస్తోంది.