వివేకానంద రాక్‌ మెమోరియల్‌లోని ధ్యాన మందిరంలో ప్రధాని మోదీ ధ్యానం మొదలు పెట్టారు.

కాషాయ దుస్తులు ధరించిన మోదీ నుదుటన విబూది పెట్టుకుని అత్యంత శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు.

మందిరంలో ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా ఓంకార చిత్రానికి ఎదురుగా కూర్చున్నారు ప్రధాని మోదీ.

దాదాపు 45 గంటల పాటు ఇలాగే ధ్యానంలో ఉంటానని ప్రధాని మోదీ ఇప్పటికే వెల్లడించారు.

ఎన్నికల ఫలితాల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా ధ్యానం చేసుకుంటానని మోదీ చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలోనూ మోదీ ఇలాగే కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేశారు.

సూర్యునికి నమస్కారం చేసి పూజలు ఆచరించిన మోదీ రుద్రాక్ష మాలతో సముద్ర తీరంలో ధ్యానం చేశారు.

Image Source: ANI

మోదీ ధ్యానం చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Thanks for Reading. UP NEXT

ఇకపై డ్రైవింగ్‌ స్కూల్స్‌లోనే లైసెన్స్ తీసుకోవచ్చు, జూన్ 1 నుంచి కొత్త రూల్స్

View next story