భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెస్టిండీస్ చేతిలో టీ20 సిరీస్ ఓడిపోవడమే దీనికి కారణం.

ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిస్‌ఫైర్ అయ్యాయి.

దీనికి తోడు హార్దిక్ పెర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఓడిన మ్యాచ్‌ల్లో చాహల్‌తో నాలుగు ఓవర్లు పూర్తి చేయనివ్వకపోవడంపై భారీగా విమర్శలు వచ్చాయి.

మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కూడా దీనిపై ట్వీట్ చేశాడు.

టీ20ల్లో వెస్టిండీస్‌పై భారత్ సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి.

హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్‌పై కూడా విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.

మూడో టీ20లో తిలక్ వర్మ అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా హార్దిక్ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు.

దీనిపై కూడా నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.