ప్రతి ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: ABP Live AI

జీర్ణక్రియకై

నానబెట్టిన ఎండుద్రాక్షలో పీచు అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నయం చేస్తుంది.

Image Source: Canva

హీమోగ్లోబిన్

ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్షలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనతతో ఇబ్బంది పడేవారు తింటే మంచిది.

Image Source: Canva

గుండె ఆరోగ్యానికై..

పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి కాబట్టి.. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: Canva

ఎముకలను బలానికై..

కాల్షియం, బోరాన్ పుష్కలంగా ఉన్న నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Source: Canva

మెరిసే చర్మానికై..

ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.

Image Source: Canva

రోగనిరోధక శక్తికై

నానబెట్టిన ఎండుద్రాక్ష మీ శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పోషకాలు అన్ని శరీరానికి అందుతాయి.

Image Source: Canva

హెల్తీ హెయిర్​కై

ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్ష స్కాల్ప్​కు రక్త ప్రసరణను పెంచుతుంది. కుదుళ్లకు బలాన్ని అందించి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Image Source: Canva

ఎనర్జీ

నానిన ఎండుద్రాక్షలు ఉదయాన్నే తింటే రోజంతా యాక్టివ్​గా ఉంటారు. అలసట తగ్గుతుంది.

Image Source: Canva

కాలేయ పనితీరుకై

ద్రాక్షలో ఉండే టార్టారిక్ ఆమ్లం.. కాలేయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image Source: Canva