అమ్మాయిలు ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుంటే కలిగే నష్టాలివే
Published by: Geddam Vijaya Madhuri
ఈ మధ్యకాలంలో అందరికీ వర్క్ ల్యాప్టాప్తోనే ఉంటుంది. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే.. దానిని టేబుల్పై కాకుండా ఒడిలో పెట్టుకుని వాడతారు.
అయితే ల్యాప్టాప్ అస్సలు ఒడిలో పెట్టుకుని వర్క్ చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అమ్మాయిలు అస్సలు ఒడిలో పెట్టుకోకూడదట.
ల్యాప్టాప్లు వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీనిని ఒడిలో పెట్టుకుంటే ఆ ప్రాంతంలో వేడి పెరుగుతుంది. ఎక్కువ కాలం ఇలా చేస్తే సంతానోత్పత్తి సమస్యలు రావొచ్చు.
ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాలను విడుదల చేస్తుంది. ఇది గర్భస్రావమయ్యే ప్రమాదం పెంచుతుంది. జనన లోపాలు కూడా వచ్చే ప్రమాదముంది.
స్కిన్ ఇరిటేషన్ను పెంచుతుంది. వేడి చేయడంతో పాటు స్కిన్ డార్క్నెస్ని పెంచుతుంది.
భంగిమ మారిపోతుంది. ఒడిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల మీరు కూర్చొనే భంగిమ మారిపోతుంది. వెన్నునొప్పి, ఒత్తిడి పెరుగుతుంది. భుజం, చేతుల నొప్పులు వస్తాయి.
ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. మీరు యాక్టివ్గా ఉండలేరు. మెటబాలీజం తగ్గుతుంది. వాపు, డీప్ సిర థ్రాంబోసిస్ సమస్యలను పెంచుతుంది.
ల్యాప్టాప్ని ఉపయోగించేప్పుడు స్టాండ్ లేదా డెస్క్ ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే చూసేందుకు సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
బిల్డ్ ఇన్ కూలింగ్ సిస్టమ్స్ని ఎంచుకుంటే మంచిది. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటే మధ్యలో గ్యాప్స్ తీసుకోమని చెప్తున్నారు.