భోజనం చేసిన తర్వాత ఎందుకు తేనుపులు ఎందుకు వస్తాయి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/health

భోజనం చేసిన తర్వాత తేనుపులు రావడం సాధారణం.

చాలామందికి తిన్న తర్వాత తేన్పులు వస్తాయి. ఇది సాధారణమైన విషయమే అనిపించినప్పటికీ.. ఇది ఆహారపు అలవాట్లు, జీర్ణక్రియ గురించి హింట్స్ ఇస్తుందట.

Image Source: pexels

పెద్ద సమస్య కాదు

అప్పుడప్పుడు తేన్పులు రావడం సాధారణం. కానీ హానికరం కాదు. కానీ తరచుగా తేన్పులు రావడం అనేది మీరు ఎలా తింటున్నారో దానికి మీ శరీరం ఎలా స్పందిస్తుందో చెప్పడానికి సంకేతం కావొచ్చట.

Image Source: pexels

కారణం ఇదే

తేన్పులు మనం పట్టించుకోని అనేక చిన్న అలవాట్ల వల్ల సంభవించవచ్చు. కారణాలను అర్థం చేసుకోవడం ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందట.

Image Source: pexels

వేగంగా తినడం

కొందరు వేగంగా తింటారు. లేదా పెద్ద ముద్దలు తింటారట. ఆ సమయంలో అదనపు గాలిని మింగేస్తారు. అది తరువాత తేనుపు రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి తినేటప్పుడు మీ వేగాన్ని తగ్గించండి.

Image Source: pexels

జీర్ణక్రియపై ప్రభావం

తొందరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది. భోజనం చేసిన తర్వాత తేన్పులు రావడానికి ఇది ఒక ప్రధాన కారణం.

Image Source: pexels

నోరు ఎక్కువగా తెరవడం

భోజనం చేసేటప్పుడు నోరు తెరిచి ఉంచడం వల్ల అదనపు గాలి కడుపులోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల తరచుగా తేనుపులు వస్తాయి.

Image Source: pexels

తక్కువ నమలడం

తక్కువ నమలడం లేదా నోరు తెరిచి తినడం వల్ల గాలి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. శరీరం సహజంగానే తేన్పుల ద్వారా దానిని విడుదల చేస్తుంది.

Image Source: pexels

అజీర్ణం

అజీర్ణం, గ్యాస్ లేదా మలబద్ధకం కడుపులో ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ గ్యాస్ తరచుగా త్రేన్పుల ద్వారా బయటకు వస్తుంది.

Image Source: pexels

ఎక్కువ కాలం ఆకలితో ఉంటే

భోజనం మానేయడం లేదా ఎక్కువ గంటలు ఆకలితో ఉండటం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. ఇది తరచుగా తిన్న తర్వాత తేనుపు రూపంలో విడుదలవుతుంది.

Image Source: pexels