టాబ్లెట్లు, ఇంజెక్షన్లు అవసరం లేదు- డయాబెటిస్ కు కొత్త ట్రీట్మెంట్ వచ్చేసింది!
మధుమేహ బాధితులకు చైనా పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు.
సెల్ థెరపీ ద్వారా మధుమేహాన్ని నయం చేసినట్లు షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్ పరిశోధకులు తెలిపారు.
సెల్ థెరపీ ద్వారా 11 వారాల్లో మధుమేహ బాధితుడిలో వ్యాధి నయం అయినట్లు వెల్లడించారు.
సెల్ థెరపీ ద్వారా పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్ ను సీడ్ సెల్స్ గా మార్చారు.
ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ రీ క్రియేట్ చేసి డయాబెటిస్ ను కంట్రోల్ చేశారు.
ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని వైద్యులు తెలిపారు.
రెండో దశ పరిశోధన సక్సెస్ అయితే ఈ ట్రీట్మెంట్ అమల్లోకి వస్తుంది.
సెల్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు.
All Photos Credit: pexels.com