పెళ్లి మండపానికి బయల్దేరిన అనంత్ అంబానీ- బరాత్ లో బంధువుల కోలాహలం

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కాసేపట్లో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు.

ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

కొద్ద సేపటి క్రితమే అనంత్ అంబానీ ఇంటి నుంచి పెళ్లి మండపానికి బయల్దేరాడు.

ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా బయల్దేరి వెళ్లారు.

తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రుల కార్లు అనంత్ వెంట బయల్దేరాయి.

అందంగా ముస్తాబు చేసిన వాహనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అనంత్ ఇంటి నుంచి బయల్దేరే ముందు బంధువులు బరాత్ తీస్తూ సందడి చేశారు.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో కాసేపట్లో అనంత్-రాధిక పెళ్లి జరగనుంది.

ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు.